చైతన్య రావ్, అలెగ్జాండర్ సాల్నికోవ్, ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎ జర్నీ టు కాశీ’. ఈ చిత్రాన్ని వారణాసి క్రియేషన్స్ పతాకంపై దొరడ్ల బాలాజీ, శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముని కృష్ణ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 6న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ సూరి అతిథిగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు ముని కృష్ణ మాట్లాడుతూ…‘కాశీ యాత్రకు సంబంధించిన కథ ఇది. ఒక కుటుంబం కాశీకి చేసే యాత్రను నేపథ్యంగా ఎంచుకున్నాం. వినోదంతో పాటు కుటుంబ భావోద్వేగాలు ఉంటాయి. ఈ చిత్రం కాశీ విశిష్టతను ప్రతిబింబిస్తుంది.’ అన్నారు.