హీరో సత్యదేవ్ మరో ఆసక్తికర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది.
హీరో సత్యదేవ్ మరో ఆసక్తికర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్ ్డటౌన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ ఫిల్మ్ సంయుక్త నిర్మాణంలో ఎస్.ఎన్.రెడ్డి, బాలసుందరం నిర్మిస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ దర్శకుడు. నిర్మాతలు మాట్లాడుతూ ‘పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో తెలుగులో సత్యదేవ్, కన్నడలో ధనుంజయ, తమిళంలో సత్యరాజ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని రెండో షెడ్యూల్ను జరుపుకుంటోంది.
ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ మల్టీస్టారర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరికి పూర్తిచేసి వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. ప్రియ భవానీ శంకర్, సత్య అకల, సునీల్ వర్మ, జెనిఫర్ పిచినెటో తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: మణికంఠన్ కృష్ణమాచారి, సహ నిర్మాత: సుమన్ ప్రసార బాగే.