పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం “అయ్యప్పనుమ్ కోశియుమ్” తెలుగు రీమేక్గా రూపొందుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి పలు ప్రచార చిత్రాలు, మేకింగ్ వీడియో, పవన్ కళ్యాణ్ రానా ల పరిచయ వీడియోలు విడుదల కాగా, ఇవి సినిమాపై మరింత ఆసక్తి ను పెంచేశాయి. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేయడం జరిగింది.
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ఇప్పటి వరకు 45 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించింది. అంతేకాక 1.2 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ దూకుడు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. టైటిల్ సాంగ్ దూకుడుకు సినీ వర్గాలు షాకవుతున్నాయి. అక్టోబర్ 15న చిత్రం నుండి అంత ఇష్టం అంటూ ఒక మెలోడియస్ పాట విడుదల చేయనున్నారు. నిత్యా మీనన్,పవన్ మధ్య ఈ సాంగ్ ఉండనున్నట్టు తెలుస్తుంది. కాగా, చిత్రంలో రానా సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది.