2018 Moviem On Ott | ఓ మోస్తరు అంచనాలతో విడుదలై సెన్సేనల్ కలెక్షన్లు సాధిస్తున్న సినిమా 2018. మూడు వారాల క్రితం మలయాళంలో రిలీజై అక్కడ రూ.150 కోట్ల మార్క్ టచ్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక గతవారం తెలుగులో విడుదలై ఇక్కడ కూడా భారీ కలెక్షన్లు సాధిస్తుంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం లాభాల్లో ఉంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ను లాక్ చేసుకుంది.
ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనిలివ్ దక్కించుకుంది. కాగా జూన్ 7 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. టివినో థామస్, కుంజుకో బాబిన్, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జూడ్ ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
ఆర్మీలో ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న టోవినో థామస్. ప్రజల కష్టాలను ప్రపంచానికి చూపించే జర్నలిస్ట్ అపర్ణ బాలమురళి. ఓ పెద్ద మోడల్ కావడమే లక్ష్యంగా శ్రమిస్తున్న మత్య్సకార కుటుంబానికి చెందిన అసీఫ్అలీ. ప్రభుత్య కార్యాలయంలో పనిచేసే కుంచకో బొబన్. కేరళ సరిహద్దుల్లో ఉండే తమిళనాడు గ్రామానికి చెందిన లారి డ్రైవర్ కలైయారస్ టూరిస్ట్లకి గైడ్గా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న అజు వర్ఘీస్. ఇలా ఎవరి జీవితాల్లో వారు వారి పనుల్లో బిజీగా ఉంటారు. అలా జీవితాన్ని కొనసాగిస్తన్న వీళ్ల లైఫ్లోకి అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంటుంది. అదే కేరళ వరదలు. ఆ సమయంలో ఒకరికొకరు ఎలా అండగా నిలబడ్డారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎలా కాపాడారు అనే కథాంశంతో ఈసినిమా తెరకెక్కింది.
s