Rajamouli | ఓటమెరుగని విక్రమార్కుడిగా రాజమౌళి ఇండియా సినిమాని శాసిస్తున్నాడు. ఒకటిని మించి మరోలా ఆయన సినిమాలు ఉంటున్నాయి. చివరిగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో అనేక రికార్డులు తిరగరాసాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ సుమారు 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు సంబంధించిన షూటింగ్ పార్ట్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు రెండు షెడ్యూల్ లను పూర్తి చేసిన జక్కన్న మూడో షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరుపుతున్నాడని సమాచారం. ఈ మూవీలో గ్లోబల్ భామ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు
ఈ ప్రాజెక్టుకు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ కథను అందించారు. అమెజాన్ అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్ గా సినిమా రూపుదిద్దుకుంటుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, రాజమౌళి చాలా కేర్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కో సీన్ ను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారట. ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా ఎంగేజ్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని అర్ధమవుతుంది. ఈ సినిమాలో ఒక్క యాక్షన్ సీన్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది.
సినిమాలో ఐదు నిమిషాల పాటు ఉండే ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా సమాచారం . హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నేపధ్యం లో తెరకెక్కుతున్న ఈ ఫైట్ కి భారీగా గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉంటుందట. అందుకే ఆ రేంజ్లో ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇక ఈ ఫైట్ కోసం ప్రత్యేకంగా ఒక సెట్ ని కూడా నిర్మించినట్టు సమాచారం.రెబల్ స్టార్ ప్రభాస్ తో నిర్మించిన చిత్రం బాహుబలి, బాహుబలి 2 లకి ఏకంగా 5 ఏళ్ల సమయం పట్టింది. ఇక ఆస్కార్ అవార్డును కొట్టిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కూడా రాజమౌళి రెండేళ్ల పాటు చిత్రీకరించారు. మరి మహేష్ సినిమాని ఎన్నేళ్లలో పూర్తి చేస్తాడో చూడాలి.