భీమ్లానాయక్, డేనియల్ శేఖర్ అటవీ ప్రాంతంలో హోరాహోరి పోరుకు సిద్ధమయ్యారు. వారి మధ్య శత్రుత్వానికి కారణమేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు సాగర్ కె చంద్ర. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్’. పవన్కల్యాణ్, రానా దగ్గుబాటి కథానాయకులుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ప్లే, సంభాషణలను సమకూర్చుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వికారాబాద్లో జరుగుతున్నది. పవన్కల్యాణ్, రానాలపై పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదలకానుంది. నిత్యామీనన్, సంయుక్తమీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.