లక్ష్, వేదిక దత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గ్యాంగ్స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో ఈనెల 24న విడుదలవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. హీరో లక్ష్ మాట్లాడుతూ..‘మంచి కంటెంట్తో వస్తున్న చిత్రమిది. యూనిట్ అంతా సొంత సినిమా అనుకుని శ్రమించారు. మీకు తప్పకుండా నచ్చుతుంది.
మనమంతా థియేటర్స్లో సినిమాను చూసి ఎంజాయ్ చేసిన వాళ్లం. ఈ చిత్రాన్నీ అలాగే ఆస్వాదిస్తారు’ అన్నారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘మా అబ్బాయి లక్ష్లా ప్రతిభ గల నటీనటులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరికీ అవకాశాలు కల్పించాలనే చిన్న చిత్రాలు నిర్మిస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో దాదాపు పదిహేను చిత్రాలను నిర్మిస్తున్నాం. ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా హిట్ కొడుతుందని నమ్మకంతో ఉన్నాం.’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు నిర్మాతలు కేఎస్ రామారావు, సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.