Keerthy Suresh | జాతీయ అవార్డు గ్రహీత, మహానటి కీర్తి సురేశ్ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని కీర్తి సురేశ్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. సెల్ఫీ దిగిన కీర్తి.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ… నెగిటివ్ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ రోజుల్లో నెగిటివ్ అంటే సానుకూల విషయమని తెలిపింది. మీ యొక్క గొప్ప ప్రేమకు, ప్రార్థనలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పొంగల్, సంక్రాంతి పండుగలకు మంచిగా జరుపుకున్నారని విశ్వసిస్తున్నానని కీర్తి సురేశ్ పేర్కొన్నది.
వారం రోజుల క్రితం.. నాకు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది అని కీర్తి సురేశ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నానని కీర్తి సురేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. తనను కలిసిన వారందరూ టెస్టులు చేసుకోవాలని సూచించారు. అలాగే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పటికి ఇంకా వ్యాక్సిన్ వేసుకోని వారు టీకాలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే కీర్తి సురేశ్ ప్రస్తుతం మహేశ్ బాబుతో సర్కారు వారి పాట, చిరంజీవితో భోళా శంకర్ సినిమాల్లో నటిస్తుంది.