పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న చారిత్రాత్మ చిత్రం హరిహర వీరమల్లు. భారీ బడ్జెట్తో ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీనిపై తాజాగా ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన హరిహర వీరమల్లులో అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఔరంగజేబ్ పాత్రలో అర్జున్ రాంపాల్ కనిపించనుండగా, 17వ శతాబ్ధపు మొఘల్ రాణిగా జాక్వెలిన్ కనిపించనుంది. చిత్ర షూటింగ్ 50 శాతం పూర్తి కాగా, ఇప్పటి వరకు వారు పాల్గొనలేదు. తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్లో జరగనుండగా, ఆ షెడ్యూల్లో అర్జున్, జాక్వెలిన్ పాల్గొంటారని ఏఎం రత్నం అంటున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది సినిమాపై భారీ అంచనాలు పెంచింది.