ముంబై, నవంబర్ 2: కొటక్ మహింద్రా బ్యాంక్ తన జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో 51 శాతం వాటాను విక్రయించనుంది. కొటక్ జనరల్ ఇన్సూరెన్స్లో మెజారిటీ వాటాను రూ.5,051 కోట్లకు స్విట్జర్లాండ్కు చెందిన జ్యురిచ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయనున్నట్టు కొటక్ బ్యాంక్ స్టాక్ ఎక్సేంజీలకు గురువారం తెలిపింది. ఈ వాటా కొనుగోలు పూర్తయిన మూడేండ్లలోపు మరో 19 శాతం వాటాను స్విస్ సంస్థ కొంటుందని బ్యాంక్ వివరించింది. దేశీయ జీవితేతర బీమా పరిశ్రమలో సెప్టెంబర్ చివరినాటికి కొటక్ జనరల్ ఇన్సూరెన్స్కు 0.52 శాతం వాటా ఉన్నది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల ప్రీమియం ఆదాయం రూ.1,148 కోట్లు. కొటక జనరల్కు రూ.7,943 కోట్ల విలువ కడుతూ ప్రస్తుత వాటా విక్రయం జరుగుతున్నది.