న్యూఢిల్లీ, జూలై 8: ఫుడ్ ఆర్డర్ వేదిక జొమాటో రూ.9,375 కోట్ల పబ్లిక్ ఇష్యూకు వస్తున్నది. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఈ నెల 14న మొదలై 16న ముగియనున్నది. షేర్ ధరల శ్రేణిని రూ.72-76గా నిర్ణయించినట్లు గురువారం జొమాటో ప్రకటించింది. కాగా, ఈ ఇష్యూలో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ రూ.375 కోట్లను సమీకరించనుండగా, ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ విలువ రూ.9,000 కోట్లని జొమాటో తెలిపింది. ఇక ఐపీవో తర్వాత సంస్థ విలువ రూ.64,365 కోట్లకు చేరవచ్చని జొమాటో సీఎఫ్వో అక్షంత్ గోయల్ అంచనా వేశారు.