Yes Bank | ముంబై, జూలై 22: గత మూడేండ్లుగా నష్టాలనే ప్రకటించిన ప్రైవేట్ రంగ సంస్థ యెస్ బ్యాంక్.. ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ఈ ఏప్రిల్-జూన్లో బ్యాంక్ నికర లాభం 10.3 శాతం పెరిగి రూ. 343 కోట్లకు చేరుకున్నది. మొండి బకాయిలు 13.2 శాతం నుంచి 2 శాతానికి తగ్గాయి. మార్చి 2020 తర్వాత బ్యాంక్ లాభాలు ప్రకటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం బ్యాంక్లో మెజార్టీ వాటా ఎస్బీఐకి 69.2 శాతంగా ఉన్నదని యెస్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 150 శాఖలను ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు.