BharatPe | ప్రముఖ ఫిన్టెక్ సంస్థ భారత్పేలో దుర్వినియోగం, దుష్ప్రవర్తన, ఫ్రాడ్పై సంస్థ ఇన్వెస్టర్ సెక్యూయియా క్యాపిటల్ ఘాటుగా స్పందించింది. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రవర్తనకు పాల్పడినా, మోసానికి పాల్పడిన కఠినంగా స్పందిస్తామని ఆదివారం తేల్చి చెప్పింది. ఎటువంటి తప్పిదాలను సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భారత్ పేలో సిక్యూయియా క్యాపిటల్ అతిపెద్ద వాటాదారు. భారత్ పే సహ-వ్యవస్థాపకుడిగా అశ్నీర్ గ్రోవర్ను వర్చువల్గా ఆయన విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ నేపథ్యంలో సంస్థ వాటాదారులు, ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని సెక్యూయియా తన బ్లాగ్ పోస్ట్లో రాసుకుంది. ఆర్థికంగా ఖర్చైనా సరే వెనుకంజ వేసేది లేదని తేల్చేసింది. సంస్థ ప్రయోజనాలకు సరైన నిర్ణయం అని భావిస్తే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని పరోక్ష వ్యాఖ్యలు చేసింది. కంపెనీలు విలువైనవిగా శాశ్వతంగా నిలువాలని కోరుకుంటున్నట్లు ఈ అమెరికా వెంచర్ క్యాపిటల్ సంస్థ తెలిపింది.
కొందరు పోర్ట్ఫోలియో ఫౌండర్లు మోసపూరిత పద్ధతులకు పాల్పడినట్లు, సుపరిపాలనా పద్దతులే పాటించలేదని ఇటీవల సంస్థ జరిపిన దర్యాప్తులో తేలిందని సెక్యూయీయా తెలిపింది. ఈ ఆరోపణలు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని వివరించింది. ఫౌండర్లు సుదీర్ఘ కాలం సేవలందించాలని మేం ఎల్లవేళలా ప్రోత్సహిస్తుంటాం. శాశ్వతమైన విధానాలపైనే దృష్టి పెడతాం అని పేర్కొంది.
స్టార్టప్ వ్యవస్థకు కాపలాదారులు అవసరం కనుక తప్పు చేసే కొద్ది మంది ఫౌండర్లు భారీ ఎదురుదెబ్బలు తీయొద్దు అని స్పష్టం చేసింది. సంస్థ సహా వ్యవస్థాపకుడిగా అశ్నీర్ గ్రోవర్ ప్రారంభంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడన్న ఆరోపణలు వచ్చాయి. భారత్ పే అంతర్గత దర్యాప్తులో అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. దీంతో సంస్థ నుంచి ఆయనను బయటకు పంపించారు.