Ola Scooters | ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1
ఆవిష్కరించిన ఓలా.. సుదీర్ఘ కాల విరామం తర్వాత కస్టమర్లకు స్కూటర్ల డెలివరీ ప్రారంభించింది. బెంగళూరు, చెన్నైల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో 100 మంది కస్టమర్లకు స్కూటర్లరు పంపిణీ చేశారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. గత ఆగస్టు 15న ఓలా ఈ స్కూటర్ను ఓలా ఎలక్ట్రిక్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
స్కూటర్ ఆవిష్కరణ టైంలోనే ఓలా ఎలక్ట్రిక్.. వాటి బుకింగ్ కోసం విండో ప్రారంభించింది. తిరిగి సెప్టెంబర్లో స్కూటర్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా గత నెల 10 నుంచి వివిధ నగరాల పరిధిలో టైస్ట్ రైడ్స్ ప్రారంభమయ్యాయి. వచ్చే జనవరిలో మరో దఫా స్కూటర్ల కొనుగోలుకు బుకింగ్స్ ప్రారంభించింది. ఈ-స్కూటర్ కావాలనుకున్న వారు రూ.499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎస్ 1 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.99,999, ఎస్1 ప్రో ధర రూ.1,29,999గా ఖరారు చేసిన సంగతి తెలిసిందే.