న్యూఢిల్లీ, మే 16 : టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.51,970 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. లాభాలను ప్రకటించడం గత ఆరేండ్లలో ఇదే తొలిసారి.
అంతక్రితం ఏడాది సంస్థ రూ.7,167 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 3 శాతం ఎగబాకి రూ.11,332 కోట్లకు చేరుకున్నాయి.