న్యూఢిల్లీ: రిలయన్ జియో ఎంట్రీ.. అప్పుల ఊబి.. ఏజీఆర్ బకాయిల చెల్లింపు వంటి అంశాలతో నష్టాల్లో కూరుకున్నప్రైవేట్ టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జూన్ నెలలో వొడాఫోన్ ఐడియా భారీ స్థాయిలో 42.8 లక్షల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో వొడాఫోన్ ఐడియా కస్టమర్ల సంఖ్య 27.3 కోట్లకు పడిపోయింది.
మరోవైపు రిలయన్స్ ఖాతాదారులకు అదనంగా 54.6 లక్షలు, భారతీ ఎయిర్టెల్కు 38.1 లక్షల కస్టమర్లు జత కలిశారని ట్రాయ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కొత్తగా 54.6 లక్షల మంది సబ్స్క్రైబర్ల చేరికతో రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్య 43.6 కోట్లకు చేరింది. వైర్లైన్ కస్టమర్లు జియోకు 1.87 లక్షల మంది వచ్చి చేరారు.
భారతీ ఎయిర్టెల్కు 38.1 లక్షల సబ్స్క్రైబర్ల రాకతో మొత్తం దాని ఖాతాదారుల సంఖ్య 35.2 కోట్ల వద్ద స్థిరపడింది. పట్టణ టెలిఫోన్ సబ్స్క్రిప్షన్లు పెరిగితే, గ్రామీణ సబ్స్క్రిప్షన్లు జూన్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
జూన్ నెలాఖరు నాటికి టాప్-5 సర్వీస్ ప్రొవైడర్లు దేశవ్యాప్తంగా మొత్తం బ్రాడ్ బ్యాండ్ సబ్స్క్రైబర్లలో 98.7 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉన్నారు. రిలయన్స్ జియో 439.91 మిలియన్లు, భారతీ ఎయిర్టెల్ 197.10 మిలియన్లు, వొడాఫోన్ ఐడియా 121.42 మిలియన్లు, బీఎస్ఎన్ఎల్ 22.69 మిలియన్లు, ఆర్టియా 1.92 మిలియన్ల ఖాతాదారులను కలిగి ఉన్నారని ట్రాయ్ వెల్లడించింది.