హైదరాబాద్, సెప్టెంబర్ 30: వైజాగ్ స్టీల్ పేరుతో కార్యకలాపాలు అందిస్తున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్) క్రమంగా నష్టాలను తగ్గించుకుంటున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.789 కోట్ల నష్టం వచ్చినట్లు గురువారం ప్రకటించింది. అంతక్రితం ఏడాది వచ్చిన రూ.3,910 కోట్ల నష్టంతో పోలిస్తే భారీగా తగ్గినట్లు అయింది. కరోనాతో గతేడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆదా యం మాత్రం 14 శాతం పెరిగి 17,980 కోట్లు ఆర్జించినట్లు కంపెనీ సీఎండీ అతుల్ భట్ తెలిపారు.