న్యూఢిల్లీ, జూన్ 20: మైనింగ్ దిగ్గజం వేదాంతకు తమిళనాడులో ఉన్న కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టింది. తమిళనాడులో ట్యుటికోరిన్లో ఉన్న అత్యాధునిక స్మెల్టర్, రిఫైనింగ్ కాంప్లెక్స్ విక్రయానికి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) బిడ్స్ ఆహ్వానిస్తూ వేదాంత సోమవారం వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఈవోఐలు సమర్పించడానికి జూలై 4 చివరితేదీ. పర్యావరణ ఆందోళనలతో తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు ఉత్తర్వుల మేరకు 2018లో ఈ ప్లాంట్ మూతపడింది. అప్పట్లో ప్లాంట్ ముందు ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది మృతిచెందారు. దీనిని తిరిగి తెరవడానికి పలు సమస్యలు ఎదుర్కోవడంతో వేదాంత దీనిని విక్రయించాలని నిర్ణయించింది. కొవిడ్ సంక్షోభ సమయంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతించినప్పటికీ, రాగి, ఇతర ఉత్పత్తులను తయారు చేయరాదని ఆదేశించింది. దేశంలో రాగికి ఉన్న డిమాండ్లో 40 శాతం ట్యుటికోరిన్ ప్లాంట్ తీరుస్తున్నదని, ప్రభుత్వ ఖజానాకు రూ. 2,500 కోట్లు సమకూరుస్తుందని, 5,000 మందికి ప్రత్యక్షంగా, 25,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్టు వేదాంత వివరించింది.