UPI | న్యూఢిల్లీ, మే 2: నమీబియాలో యూపీఐ తరహా ఇన్స్టంట్ పేమెంట్ సిస్టమ్ అభివృద్ధికి బ్యాంక్ ఆఫ్ నమీబియాతో తమ విదేశీ అనుబంధ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఎన్పీసీఐ తెలిపింది. భారత్లో యూపీఐలాగే నమీబియాలో ఓ ఇన్స్టంట్ పేమెంట్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేసేలా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్).. బ్యాంక్ ఆఫ్ నమీబియాతో అగ్రిమెంట్ చేసుకున్నది. తమ ఈ భాగస్వామ్యం.. నమీబియా ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయగలదని, పర్సన్-టు-పర్సన్ (పీ2పీ), పర్సన్-టు-మర్చంట్ లావాదేవీలకు దోహదపడుతుందన్న ఆశాభావాన్ని ఎన్పీసీఐ వ్యక్తం చేసింది.