హైదరాబాద్, డిసెంబర్ 14: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీరేట్లను పెంచేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో గృహ, వాహన రుణాలపై వడ్డీరేటు మరింత అధికంకానున్నది. పెంచిన వడ్డీరేట్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయని పేర్కొంది. మూడేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.60 శాతానికి, ఏడాది రుణాలపై 8.25 శాతం, రెండేండ్ల రుణాలపై రేటును 8.45 శాతానికి పెంచింది. అలాగే ఆరు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ను 8.05 శాతానికి పెంచిన బ్యాంక్..మూడు నెలల 7.85 శాతంగాను, నెల రుణాలపై 7.65 శాతంగా నిర్ణయించింది. దీంతోపాటు ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు(ఈబీఎల్ఆర్)ని 9.05 శాతానికి పెంచింది.