న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో 2021 న్యూ ట్రయంఫ్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైక్ను ట్రయంఫ్ మోటార్సైకిల్స్ ఇండియా లాంఛ్ చేసింది. బీఎస్ 6 ఇంజన్తో కూడిన 2021 ట్రయంఫ్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ రూ 9,35,000 (ఎక్స్షోరూం, ఇండియా)కు అందుబాటులో ఉంది. న్యూ స్ర్కాంబ్లర్ బైక్ సరికొత్త ఫీచర్లతో పాటు పలు కలర్ స్కీమ్స్తో కస్టమర్ల ముందుకొచ్చింది. న్యూ బైక్ 2021 కవాసాకి జడ్900, 2021 డుకాటి మాన్స్టర్ ఇండియాలకు దీటైన పోటీ ఇవ్వనుంది.
న్యూ ట్రయంఫ్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ మెరుగైన రైడ్ క్వాలిటీ తాజాపరిచిన ఎర్గోనామిక్స్తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. సరైన రైడింగ్ పొజిషన్కు అనువుగా 790ఎంఎం సీట్ హైట్తో పాటు రిలాక్స్గా రైడ్ చేసేందుకు వెసులుబాటు ఇచ్చే సిగ్నేచర్ స్క్రాంబ్లర్ వైడ్ హ్యాండిల్బార్స్ వంటి ఫీచర్లున్నాయి. 900 సీసీ ఇంజన్ సామర్ధ్యంతో పాటు పలు అత్యాధునిక ఫీచర్లతో 2021 న్యూ ట్రయంఫ్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ ఆకట్టుకోనుంది.