Edible Oils to Cool | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం జరుగుతుండగా, మరోవైపు పామ్ ఆయిల్ ఎగుమతిపై ఇండోనేషియా నిషేధం విధించింది. ప్రపంచంలోకెల్లా వంటనూనెల దిగుమతిలో భారత్ టాప్లో నిలుస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వంట నూనెల ధరలు ఆకాశాన్నంటే రీతిలో పైపైకి దూసుకెళ్లాయి. మరోవైపు, ముడి చమురు ధరలు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోయాయి. దీని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఈ భారం తగ్గింపు కోసం కేంద్రం కసరత్తు చేస్తున్నదని వినికిడి. ముడి పామాయిల్పై 5 శాతం నుంచి వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్ కొంత తగ్గించనున్నదని వార్తలొచ్చాయి. ఎంత పన్ను తగ్గించాలన్న అంశంపై ఇంకా చర్చలు సాగుతున్నాయి.
ఫైనాన్స్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం ప్రాథమిక పన్నులపై అదనంగా సెస్ విధిస్తారు. అయితే, ముడి పామాయిల్పై దిగుమతి సుంకం పూర్తిగా రద్దు చేసేసింది. కానీ పన్ను, సెస్ తగ్గింపు వార్తలపై స్పందించడానికి ఆర్థిక మంత్రిత్వశాఖ నిరాకరించింది. వ్యవసాయ, ఆహార మంత్రిత్వశాఖలు సైతం స్పందించలేదు. వంట నూనెల కోసం భారత్ 60 శాతం దిగుమతులపైనే ఆధారపడటం కూడా వాటి ధరలు పైపైకి దూసుకెళ్లడానికి కారణం.
అత్యధికంగా మనదేశానికి సన్ఫ్లవర్ ఆయిల్.. ఉక్రెయిన్ నుంచి దిగుమతి అవుతుంది. రష్యా యుద్ధానికి దిగడంతో ఉక్రెయిన్ నుంచి వంట నూనెల సరఫరా నిలిచిపోయింది. మరోవైపు దేశీయ మార్కెట్ అవసరాల కోసం ఇండోనేషియా పామాయిల్ ఎగుమతిపై నిషేధం విధించింది. దీనివల్లే దేశంలో వంట నూనెల ధరలు పెరిగిపోతున్నాయి.
ఇంతకుముందు కూడా వంట నూనెల ధరలను తగ్గించడానికి పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్లపై దిగమతి సుంకాలను కేంద్రం తగ్గించేసింది. కృత్రిమ కొరతను నివారించడానికి పరిమిత నిల్వలను అనుమతించింది. కనొలా ఆయిల్, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రైన్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్పై 5-35 శాతం దిగుమతి సుంకాలు తగ్గించనున్నది.