న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఆభరణాల విక్రయ సంస్థ టైటాన్..తన సబ్సిడరీ సంస్థయైన క్యారట్లేన్ను హస్తగతం చేసుకున్నది. సంస్థలో మరో 27.18 శాతం వాటాను రూ.4,621 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో క్యారట్లేన్లో టైటాన్ వాటా 98.28 శాతానికి చేరుకున్నది. క్యారట్లేన్ ఫౌండర్స్ మిథున్ సచేటి, శ్రీనివాసన్ గోపాలన్తోపాటు వారి కుటుంబ సభ్యులకు ఉన్న 27.18 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆభరణాల ఉత్పత్తి, విక్రయ సేవలు అందిస్తున్న క్యారట్లేన్ గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను .2,177 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సందర్భంగా టైటాన్ ఎండీ సీకే వెంకటరామన్ మాట్లాడుతూ..ఆభరణాల విక్రయాల్లో బలమైన వృద్ధిని సాధించినట్లు, దేశీయ కస్టమర్లు నమ్మకం పెట్టుకోవడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు.
అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న చౌక, ఆభరణాల మార్కెట్లో 2008 నుంచి క్యారట్లేన్ ఆన్లైన్లో తన ఉత్పత్తులను విక్రయిస్తున్నది.