Sovereign Gold Bond | బంగారం అంటే కేవలం ఆభరణాలు మాత్రమే కాదు.. బంగారం ఇప్పుడు పెట్టుబడి ఆప్షన్ కూడా. బంగారం కొనుగోళ్లను నిరుత్సాహ పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) పథకం కింద బాండ్లు కొనుగోలు చేసిన వారికి ఆ బాండ్ల మెచ్యూరిటీకి ముందు వాటిని రీడిమ్షన్ చేసుకోవచ్చు. 2017-18లో కేంద్రం విడుదల చేసిన ఎస్జీబీల రిడిమ్షన్ విలువ ఒక గ్రామ్పై రూ.6,199గా నిర్ణయించినట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
రిడిమ్షన్ తేదీకి ముందు మూడు రోజుల ‘999 స్వచ్ఛత (24 క్యారెట్స్)’ బంగారం ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ఖరారు ధరపై సరాసరిని బాండ్ ‘ఎస్జీబీ’ రిడిమ్షన్ విలువగా నిర్ణయిస్తుంది ఆర్బీఐ. అంటే ఈ నెల 13-15 తేదీల మధ్య ధర సగటును రీడిమ్షన్ గా నిర్ణయించినట్లు తెలిపింది. 2017లో జారీ చేసిన ఎస్జీబీ బాండ్లు ఇప్పుడు ఆరో ఏడాదిలోకి వచ్చాయి. ప్రతి సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) మెచ్యూరిటీ గడువు ఎనిమిదేండ్లు. ఐదేండ్లు పూర్తయిన తర్వాత బాండ్ల కొనుగోలుదారులు వాటిని ప్రీమెచ్యూర్ రీడిమ్షన్ చేసుకుంటే అలా చేసుకునే తేదీన అమల్లో ఉన్న వడ్డీ ఆధారంగా చెల్లిస్తారు.
2017-18లో జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) యూనిట్ విలువ రూ.2890. ప్రస్తుతం ఎస్జీబీ యూనిట్ విలువ రూ.6190. ఇందులో నుంచి రూ.2890 తీసివేస్తే రూ.3309 (వడ్డీ కాకుండానే). శాతం పరిశీలిస్తే రూ.(3309/2890×100)=114.4982%. ఒకవేళ 2017-18 నాటి సిరీస్-12 ఎస్జీబీ ఇన్వెస్టర్ ముందస్తుగా తన ఇన్వెస్ట్ మెంట్ విత్ డ్రా చేసుకుంటే 114.4982 % శాతం రిటర్న్స్ పొందొచ్చు. ఈ రిటర్న్స్కు వడ్డీ ఆదాయం అదనంగా లభిస్తుంది.