న్యూఢిల్లీ, ఆగస్టు 15: ప్రముఖ షూ తయారీ సంస్థ బాటా..పాదరక్షలు, షూల ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నది. గడిచిన ఎనిమిది నుంచి తొమ్మిది నెలలుగా ధరలు పెంచలేదని, ముడిసరుకులు, ద్రవ్యోల్బణం కారణంగా సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి ధరల పెంపు తప్పదని కంపెనీ ఎండీ, సీఈవో గుంజన్ షా స్పష్టంచేశారు.
ప్రీమియం ధరల సెగ్మెంట్లోకి తిరిగి ప్రవేశించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాదరక్షలు, షూల మార్కెట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు, బ్రాండెడ్ నుంచి చిన్న స్థాయి సంస్థలు ఎన్నో ఉన్నాయన్నారు. మరోవైపు, వ్యాపార విస్తరణలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి కొత్తగా 125 స్టోర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు.