హైదరాబాద్, జనవరి 30: ప్రముఖ ఎన్బీఎఫ్సీ ఇండెల్ మనీ లిమిటెడ్ మరోసారి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు(ఎన్సీడీ) జారీ చేసింది. ఈ నెల 30న ప్రారంభమైన ఈ ఎన్సీడీల ఇష్యూ వచ్చే నెల 12న ముగియనున్నదని కంపెనీ ఎగ్జిక్యూటివ్ హోల్టైం డైరెక్టర్ ఉమేశ్ మోహనన్ తెలిపారు. ఈ ఎన్సీడీ ద్వారా మొత్తంగా రూ.200 కోట్లు సేకరించాలని నిర్ణయించింది.
ముఖ విలువ రూ.1,000గా నిర్ణయించింది. కనీసంగా 10 ఎన్సీడీలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేవలం 72 నెలల్లో తమ పెట్టుబడులు రెండింతలు కానున్నాయి. కూపన్ రేటును 12.25 శాతంగా నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణలో 18 శాఖలు ఉండగా, కొత్తగా 12 శాఖలను ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.