న్యూఢిల్లీ, జనవరి 13: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్..రిపబ్లిక్ డే సేల్ను ప్రకటించింది. ఈ నెల 19 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కింద ఐఫోన్లను గొప్ప తగ్గింపు ధరకు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ 15, ఐఫోన్ 14లను 17 శాతం వరకు తగ్గించి విక్రయిస్తున్నది. వీటితోపాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులపై ఎక్సేంజ్ ఆఫర్ అందిస్తున్నది.
ప్రస్తుతం మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 15 ధర రూ.79,900 కాగా, ఫ్లిప్కార్ట్లో మాత్రం 17 శాతం తగ్గింపుతో రూ.65,999కి లభించనున్నది. 128 జీబీ మెమొరీతో 6.1 అంగుళాల టచ్స్క్రీన్ సూపర్ రెటినా ఎక్స్డీఆర్ డిస్ప్లే, ముందు 12 మెగాపిక్సెల్ కెమెరా, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే రూ.69,900 ధర కలిగిన ఐఫోన్ 14ని రూ.57,999కి దించింది.