న్యూఢిల్లీ, జూన్ 26: కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా.. 30 వేల యూనిట్ల కారెన్స్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నది. సెప్టెంబర్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు తయారైన 30,297 మాడళ్లను వెనక్కి పిలిపిస్తున్నది.
రెగ్యులర్ చెకప్లో భాగంగా సాఫ్ట్వేర్లో సమస్య గుర్తించినట్టు, దీనిని ఉచితంగా అప్డేట్ చేసి కస్టమర్లకు అందచేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ రీకాల్లో భాగంగా ఈ కారు ఓనర్లు కంపెనీకి సంబంధించిన డీలర్ల వద్ద సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.