న్యూఢిల్లీ, ఆగస్టు 29: జీఎస్టీ కౌన్సిల్ మళ్లీ సమావేశం కాబోతున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో భేటీ కాబోతున్నది. 58వ సారి జరుగుతున్న ఈ సమావేశానికి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించనుండగా, రాష్ర్టాల ఆర్థిక మంత్రులు హాజరుకాబోతున్నారు.
సెప్టెంబర్ 3-4, 2025న సమావేశమైన కౌన్సిల్ మళ్లీ ఇంచుమించు ఏడాది తర్వాత భేటీ కాబోతుండటం ప్రాధాన్యత సంతరించుకున్నది.