TCS CEO | దేశీయ ఐటీసేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో పదవికి రాజేశ్ గోపీనాథ్ రాజీనామా చేశారు. కంపెనీ ఆయన స్థానంలో కే కృతివాసన్ను ఇన్చార్జి సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు టాటా గ్రూప్నకు చెందిన కంపెనీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గోపీనాథన్ టీసీఎస్లో దాదాపు 22 ఏళ్లపాటు సేవలందించారు. కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా, సీఈవో ఆరేళ్లు సేవలందించారు. అయితే, వచ్చే సెప్టెంబర్ వరకు ఆయన కంపెనీలో సేవలు అందించనున్నారు. ఆయన స్థానంలో కృతివాసన్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయన పూర్తిస్థాయి సీఈవోగా నియాకమకం కానున్నారు. కే కృతివాసన్ ప్రస్తుతం కంపెనీలు బ్యాకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ వ్యాపార విభాగానికి అ ధ్యక్షుడు, గ్లోబల్ హెడ్గా ఉన్నారు. 1989లో కంపెనీలో చేరిన ఆయన.. 34 ఏళ్లుగా కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, లార్జ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, సేల్స్ తదితర విభాగాల్లో సేవలందించారు. అలాగే టీసీఎస్ ఐర్లాండ్ డైరెక్టర్ల బోర్డు, టీసీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏజీ పర్యవేణ బోర్డు సభ్యుడిగానూ ఉన్నారు. ఆయన మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. అలాగే ఐఐటీ కాన్పూర్ నుంచి ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.