న్యూఢిల్లీ, జూన్ 30 : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ దేశీయ మార్కెట్కు మరో ఈవీ మాడల్ను తీసుకొచ్చింది. సియారీ ఈవీ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ రు ప్రారంభ ధరను రూ.18.79 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..గరిష్ఠంగా రూ.24.79 లక్షలుగా నిర్ణయించింది. బుకింగ్లు ప్రారంభించిన సంస్థ..జూలై 15 నుంచి డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది.
కేవలం 5.8 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. 75 కిలోవాట్ల బ్యాటరీ సింగిల్ చార్జింగ్తో 665 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నది. అలాగే 63 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ 565 కిలోమీటర్లకు పైగా మైలేజీ ఇవ్వనున్నది. కారుతోటే యూపీఐ చెల్లింపులు జరుపడంతోపాటు ఎయిర్కన్సోల్ గేమింగ్, ఈవీ రూట్ ప్లాన్ కూడా చేసుకోవచ్చునని తెలిపింది.