న్యూఢిల్లీ, ఆగస్టు 21 : టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ సంస్థ కూడా తన వాహన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను రూ.25 వేల వరకు సవరిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఉత్పత్తి వ్యయం అధికావడంతోపాటు ద్రవ్యోల్బణం ఒత్తిడి కారణంగా ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంస్థ రూ.4.7 లక్షలు మొదలుకొని రూ.31 లక్షల్లోపు ధర కలిగిన పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.