హైదరాబాద్, సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): భారత్- యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య ఇన్నోవేషన్ ఎకో సిస్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు టీ హబ్, పొంటాక్ సంస్థలు పర్పసర్పం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మంగళవారం టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాస రావుతో పొంటాక్ మేనేజింగ్ పార్టనర్ ప్రేమ్తో స్టార్టప్ అనుకూల వాతావరణ వ్యవస్థపై ప్రధానంగా చర్చించారు. అనంతరం కలిసి పనిచేసేందుకు ఒక ఒప్పందాన్ని కుదర్చుకున్నారు. ఈ సందర్భంగా టీ హబ్ సీఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్టార్టప్ కంపెనీలకు అవసరమైన పెట్టుబడులతో పాటు అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఈ ఒప్పందం ద్వారా లభించనున్నదన్నారు.
పొంటాక్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ ప్రేమ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో మా సంస్థ కార్యకలాపాలను ఈ విధంగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ చూపిస్తున్న చొరవతో ఐటీ రంగం, స్టార్టప్ కంపెనీలు ఎంతో వృద్ధిని కనబరుస్తున్నాయన్నారు. దీంతో పాటు కొత్తగా మరో రెండు కంపెనీలైన మైనీబో, మ్యాక్స్ బైట్ టెక్నాలజీస్ కార్యకలాపాలు మరో 6 నెలల్లో హైదరాబాద్లో ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రారంభంలో 20 మంది ఉద్యోగులను నియమించుకొని, ఏడాదిలో 5 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు సిద్దం చేసుకున్నామని ఆయన తెలిపారు.