హైదరాబాద్, మే 10 ( నమస్తే తెలంగాణ): మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ హైదరాబాద్లో తమ యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్విట్జర్లాండ్కు చెందిన ఎనలిటికల్, ఇన్నోవేషన్ హబ్ స్విస్ రీ గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ (జీబీఎస్) తమ నూతన కేంద్రాన్ని భాగ్యగనరంలో ఈ సంవత్సరం సెప్టెంబర్లో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం ప్రకటించింది. స్విస్ రీ యూనిట్ను ఏర్పాటు చయడానికి హైదరాబాద్ అద్భుతమైన ప్రాంతంగా తాము భావిస్తున్నామని కంపెనీ సీఈవో రస్సెల్ హిగ్గిన్బోతం అన్నారు. ఈ కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచాన్ని స్థిరంగా మార్చే అంతర్జాతీయ పరిష్కారాలను అందించడంలో డిజిటల్, డాటా టెక్నాలజీ సామర్ధ్యాన్ని మరింత శక్తివంతం చేస్తుందన్నారు. బెంగళూరు, హైదరాబాద్ రెండూ కూడా రీ ఇన్సూరెన్స్లో గ్లోబల్ బిజినెస్ ప్రభావాన్ని పెంచుతాయని భావిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.