న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశవ్యాప్తంగా స్పోర్ట్ యుటిలిటీ వాహనాల(ఎస్యూవీ)కు డిమాండ్ నెలకొన్నది. లగ్జరీ లుక్, సౌకర్యవంతం, నూతన ఫీచర్స్ అధికంగా ఉండటంతో కస్టమర్లు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఆటోమొబైల్ సంస్థలు కార్లను తీర్చిదిద్దడం కూడా ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా ఆగస్టు నెలలో అమ్ముడైన ఎస్యూవీ వాహనాల్లో మారుతి సుజుకీ బ్రెజ్జా, టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
పదేండ్ల క్రితం నుంచి..
పదేండ్ల క్రితం నుంచి దేశీయంగా ఎస్యూవీలకు డి మాండ్ నెలకొన్నది. కొత్తగా వాహనాలను కొనుగోలు చేసేవారు వీటికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, కంఫర్ట్, భద్రత, టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నారని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. 2015లో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన మధ్యస్థాయి ఎస్యూవీ క్రెటా ఇప్పటికి అత్యంత ప్రజాదరణ పొందుతున్నది.