Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఇక దుకాణాల్లో వినిపించనున్నది. ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సర్వీస్ ప్రొవైడర్ ఫోన్పేకు వాయిస్ను అందించారు. దాంతో ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన ప్రతీసారి మహేశ్ బాబు వాయిస్ వినిపించనున్నది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ ప్రయత్నం చేసింది. గతంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ సైతం ఇదే తరహాలో వాయిస్ను అందించారు. ఆ తర్వాత వాయిస్ ఇచ్చిన నటుడు మహేశ్ బాబే.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫోన్పే నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసిన సమయంలో మనీ రిసీవ్.. థాంక్యూ బాస్ అంటూ అంటూ మహేశ్ బాబు కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపడనున్నది. ఇందు కోసం మహేశ్ వాయిస్తో కొన్ని శాంపిల్స్ తీసుకొని ఏఐతో వాయిస్ని జనరేట్ చేసింది ఫోన్పే సంస్థ. ఇదిలా ఉండగా.. కరోనా మహమ్మారి అనంతరం దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు పెరిగిన విషయం తెలిసిందే. జాతీయ రాజధాని నుంచి మారుమూల పల్లెల వరకు డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. ఫోన్ఫే, గూగుల్పే, పేటీఎం చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి.
ఇకనుంచీ ఫోన్ పే పేమెంట్లలో మహేష్ బాబు వాయిస్ 😍🤩 pic.twitter.com/m4zt33LWMV
— Ravi Vallabhaneni (ఆహ్వానిద్దాం యువ గళం) (@ravivallabha) February 21, 2024