న్యూయార్క్ : ఫ్రెండ్స్తో పాస్వర్డ్లను షేర్ చేసుకునే కస్టమర్లపై చార్జీల భారం మోపేందుకు ఆన్లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సన్నద్ధమైంది. మార్చిలో తన పాలసీ మార్పుతో ఈ దిశగా నెట్ఫ్లిక్స్ సంకేతాలు పంపగా చార్జీల వసూలుకు తెరలేపింది. ఎక్కువ మందికి పాస్వర్డ్ షేర్ చేస్తే అదనపు చెల్లింపులు చేయాలని యూజర్లను కోరతామని నెట్ఫ్లిక్స్ గతంలో జారీ చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ కసరత్తులో భాగంగా పాస్వర్డ్ షేరింగ్పై కట్టుదిట్టమైన చర్యల కోసం పెరూ, చిలీ, కోస్టారికాలో ట్రయల్ రన్లో భాగంగా యూజర్ల నుంచి అదనపు చార్జీలను వసూలు చేస్తోంది. పాస్వర్డ్ షేరింగ్కు పాల్పడుతున్న వారిని అదనపు చార్జీలు చెల్లించాలని కోరగా కొందరు యూజర్లు సబ్స్క్రిప్షన్ను రద్దు చేసుకుంటుండటం కంపెనీని కలవరపరుస్తోంది. నెట్ప్లిక్స్ న్యూ పాలసీపై తమకు సమాచారం లేదని పాస్వర్డ్ షేరింగ్ చేస్తున్న యూజర్లు అదనపు బాదుడుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
భారత్లో ఇంతవరకూ ఈ పాలసీ అమల్లో లేకపోవడంతో ఇక్కడి యూజర్లకు అదనపు చార్జీల భారం తప్పింది. అయితే ఇతర దేశాల్లోనూ పాస్వర్డ్ షేరింగ్పై అదనపు చార్జీల వసూలుకు సంబంధించిన పాలసీపై కసరత్తు సాగుతోందని, ఒక్కో సబ్స్ర్కైబర్పై చార్జీలు ఒక్కో రకంగా ఉంటాయని నెట్ఫ్లిక్స్ ప్రతినిధి వివరణ ఇచ్చారు.