ముంబై, జూన్ 8: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయంతో ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో 350 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 294.32 పాయింట్లు కోల్పోయి 62,848.64 వద్దకు జారుకున్నది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 91.85 పాయింట్లు కోల్పోయి 18,634.55 వద్ద నిలిచింది. సూచీల్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ 2.68 శాతం తగ్గి టాప్ లూజర్గా నిలిచింది. దీంతోపాటు టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, హెచ్యూఎల్, టాటా మోటర్స్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, నెస్లె, టైటాన్లు నష్టపోయాయి. కానీ, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.