హైదరాబాద్, ఏప్రిల్ 10: బ్రిటన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఎంజీ మోటర్..తాజాగా రాష్ట్ర మార్కెట్లోకి హెక్టార్ బ్లాక్స్టోర్మ్ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు రకాల్లో లభించనున్న ఈ మాడల్ రూ.21.24 లక్షల ప్రారంభ ధర నిర్ణయించింది. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే మాడల్ ధర రూ.21,93,800 గాను, ఆరుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన మాడల్ ధర రూ. 21,97,800గా నిర్ణయించింది. ప్రీమియం లుక్తో తీర్చిదిద్దిన ఈ మాడల్పై మూడేండ్ల వ్యారెంటీ కూడా కల్పించినట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ అధికారి సతీందర్ సింగ్ బజ్వా తెలిపారు. 2019లో హెక్టార్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసినట్లు, ఈసారి దీనిని మరింత ఆధునీకరించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు, ముఖ్యంగా స్మార్ట్ టెక్నాలజీ, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపరిచినట్లు చెప్పారు.