రాష్ర్టానికి చెందిన రాకెట్ల తయారీ స్టార్టప్ స్కైరూట్..విక్రమ్-1 రాకెట్ను ప్రదర్శించింది. వచ్చే ఏడాది తొలి నాళ్లలో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్న ఈ రాకెట్ను హైదరాబాద్లోని జీఎమ్మార్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రీయల్ పార్క్లో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ రాకెట్ డెవలప్మెంట్ కేంద్రం దేశంలో అతిపెద్దది కావడం విశేషం. తక్కువ భూమి కక్ష్యలో తిరిగి 300 కిలోల బరువు కలిగిన ఈ రాకెట్ కంపెనీ నుంచి వస్తున్న రెండోది కావడం విశేషం. గతేడాది నవంబర్ 18న విక్రమ్-ఎస్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.