న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశీయ ఆటో రంగంలో మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా చిప్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వాహన ఉత్పాదక సంస్థల్లో తిరిగి ఉత్సాహం నిండింది. ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం లభించడంతో అమ్మకాలు పుంజుకున్నాయి. మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలు ఫర్వాలేదనిపిం చాయి. కియా, టయోటా, హోండా, స్కోడాలు మాత్రం టాప్గేర్లో దూసుకుపోయాయి. ప్యాసింజర్ వాహనాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొన్నదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.