హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : థర్మల్ విద్యుత్తుకు డిమాండ్ పెరుగడంతో బొగ్గు ఉత్పత్తి.. రవాణాపై సింగరేణి సంస్థ దృష్టిసారించింది. రోజుకు 1.90 లక్షల బొగ్గు ఉత్పత్తి.. రవాణాను లక్ష్యంగా పెట్టుకున్నది. అన్ని ఏరియాల జీఎంలు ఈ లక్ష్య సాధనకు కృషిచేయాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశించారు.
ఆగస్టు 31 వరకు ఐదు మాసాల కాలంలో 253 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్టు సీఎండీ తెలిపారు. ఓవర్ బర్డెన్(మట్టి) తొలగింపు టార్గెట్లో 95శాతమే లక్ష్యాన్ని అధిగమించామని, వందశాతం చేరేలా ప్రయత్నించాలని సూచించారు.