న్యూఢిల్లీ, జనవరి 3: దేశంలో గోల్డ్ ఎక్సేంజ్ ఏర్పాటుకు ట్రేడింగ్ ఎక్సేంజ్లకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అనుమతిచ్చింది. ఈ మేరకు వాల్ట్ మేనేజర్ల నియమ, నిబంధనలను సోమవారం విడుదల చేసింది. గతేడాది సెప్టెంబర్లో గోల్డ్ ఎక్సేంజ్ను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు సెబీ లైన్క్లియర్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ గోల్డ్ ఎక్సేంజ్ల్లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్టుల రూపంలో బంగారం క్రయవిక్రయాలు జరుగుతాయి. ఇదిలావుంటే కమోడిటీ ఫ్యూచర్లపై ఆప్షన్ కాంట్రాక్టుల వ్యవస్థలో సెబీ పలు సర్దుబాట్లు చేసింది. స్టాక్ ఎక్సేంజ్లతోపాటు సెబీ కమోడిటీ డెరివేటివ్స్ అడ్వైజరీ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది.