Karvy | న్యూఢిల్లీ, మార్చి 28: కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్ (కేఐఎస్ఎల్) రిజిస్ట్రేషన్ను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ గురువారం రద్దు చేసింది. గత ఏడాది మార్చి 15-17 మధ్య కేఐఎస్ఎల్లో సెబీ తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పేర్కొన్న చిరునామాలో సంస్థ కార్యకలాపాలు సాగడం లేదని సెబీ గుర్తించింది.
తదనంతర సోదాల్లోనూ కంపెనీకి ఉండాల్సిన కనీస అర్హతలూ లేవని తేలింది. దీంతో ఓ మర్చంట్ బ్యాంకర్గా ఎటువంటి నిబంధనల్నీ పాటించడం లేదంటూ సెబీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంపెనీ రిజిస్ట్రేషన్ను తొలగించింది. 2013 డిసెంబర్లో సెబీ దగ్గర మర్చంట్ బ్యాంకర్గా కేఐఎస్ఎల్ నమోదైంది.