ముంబై/కోల్కతా, జూన్ 9: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రూ.50,000 కోట్ల వరకు నిధులను సమీకరించనున్నది. దేశ, విదేశీ మార్కెట్ల నుంచి బాండ్లు తదితర రుణ సాధనాల ద్వారా సేకరించనున్నట్టు బ్యాంక్ తెలిపింది. ఈ మేరకు తమ కేంద్ర బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు స్టాక్ ఎక్సేంజ్కు ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో బ్యాంక్ ఏకీకృత నికర లాభం ఏకంగా సుమారు 90 శాతం ఎగిసి రూ.18,094 కోట్లుగా నమోదైన విషయం తెలిసిందే.