SBI Alert | కేవైసీ మోసాలపై కస్టమర్లను ఎస్బీఐ మరోమారు హెచ్చరించింది. మోసపూరిత ఎస్సెమ్మెస్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం ట్వీట్ చేసింది. డియర్ కస్టమర్.. కేవైసీ కోసం మీ ఎస్బీఐ బ్యాంక్ ఖాతా సస్పెండ్ చేశారు. దయచేసి మీకు వచ్చిన ఈ లింక్ను పది నిమిషాల్లో కంప్లీట్ చేయండి అనే మెసేజ్ వస్తుంది. ఇటువంటి మెసేజ్ మీ పర్సనల్ ఫోన్ నంబర్కు వస్తే మరో కేవైసీ ఫ్రాడ్ మీ ముంగిట ఉన్నట్లేనని తెలిపింది.
కేవైసీ ఫ్రాడ్ మెసేజ్లు వస్తున్న నేపథ్యంలో ఖాతాదారుల్లో అవగాహన పెంచేందుకు ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్పై నుంచి ట్వీట్ చేసింది. సైబర్ ఫ్రాడ్గా పరిగణించే ఒక ఎస్సెమ్మెస్ ఉదాహరణగా చూపింది. యేహ్ రాంగ్ నంబర్ హై. కేవైసీ ఫ్రాడ్. ఇటువంటి ఎస్సెమ్మెస్ వస్తే అది ఫ్రాడ్కు దారి తీస్తుంది. దాన్నిక్లిక్ చేస్తే మీ ఖాతాలో పొదుపు చేసిన మొత్తాలను కోల్పోవాల్సి వస్తుంది. అటువంటి ఎంబీడెడ్ లింక్లను క్లిక్ చేయొద్దు. సరైన ఎస్బీఐ షార్ట్ కోడ్ కోసం వెతకండి. స్టే అలర్ట్ అండ్ స్టే సేఫ్ విత్ ఎస్బీఐ అని ట్వీట్ చేసింది.
ఎంబీడెడ్ లింక్ల ద్వారా క్లిక్ చేసి కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఎస్బీఐ ఎప్పుడు అడుగబోదని తెలిపింది. గత నెల 26న ఓటీపీ షేరింగ్ పట్ల అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలని స్పష్టం చేసింది. యే రాంగ్ నంబర్ హై. సేఫ్ డిజిటల్ బ్యాంకింగ్ ఎక్స్పీరియెన్స్. స్టే అలర్ట్ అండ్ సేఫ్టీ విత్ ఎస్బీఐ అని పేర్కొంది.