న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: యాక్సిస్ బ్యాంక్తో కలిసి సామ్సంగ్ సోమవారం కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ను తీసుకొచ్చింది. తమ అల్ట్రా-ప్రీమియం మడత (ఫోల్డబుల్) స్మార్ట్ఫోన్ల అమ్మకాలను రెండింతలు పెంచుకోవాలని చూస్తున్న సామ్సంగ్.. కస్టమర్లకు అదనపు ఫైనాన్స్ సౌకర్యాన్ని ఈ కార్డుతో అందించాలని భావిస్తున్నది. ఇప్పటికే సామ్సంగ్ ఫైనాన్స్ ప్లస్తో కస్టమర్లకు ఫైనాన్స్ను అందిస్తున్న సామ్సంగ్.. 2017లో ‘సామ్సంగ్ పే’ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి 3 కోట్ల వినియోగదారులున్నారు. కాగా, గెలాక్సీ సిరీస్లో జెడ్ ఫోల్డ్ 4, ఫ్లిప్ 4 మడత స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ఇప్పుడు సామ్సంగ్ విక్రయిస్తున్నది.