న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామి సంస్థయైన సామ్సంగ్..కృత్రిమ మేధస్సుతో తయారైన స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కృత్రిమ మేధస్సు అల్ట్రా-ప్రీమియం నియో క్యూలెడ్ టీవీలు ప్రారంభ ధర రూ.1.39 లక్షలు, ఒలెడ్ టీవీ ప్రారంభ ధర రూ.1.64 లక్షలుగా నిర్ణయించింది.
ఈ సందర్భంగా సామ్సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్దీప్ సింగ్ మాట్లాడుతూ.. దేశీయంగా ప్రీమియం టీవీలకు పెరుగుతున్న డిమాండ్తో ఈ ఏడాది టీవీలను విక్రయించడంతో రూ.10 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రీమియం టీవీలతోపాటు మధ్య స్థాయి టీవీల అమ్మకాలు కూడా భారీగా పెరుగుతున్నాయన్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి వచ్చిన రూ.98,924 కోట్ల ఆదాయంలో 70 శాతం మొబైల్ ఫోన్ల నుంచి రాగా, మిగతా ఇతర వ్యాపారాలు, ముఖ్యంగా గృహోపకరణాలు, టీవీల నుంచి సమకూరినట్లు చెప్పారు. వరుసగా రెండేండ్లుగా 2021, 2022లో టీవీల వ్యాపారం రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోగా, 2023లో 32 అంగుళాల టీవీల సేల్స్ భారీగా పడిపోయాయన్నారు.