Today Stock Market | దసరా పండగ మరుసటి స్టాక్ మార్కెట్ మంచి ఊపులో ఉన్నది. గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావం భారత మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తున్నది. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్ల లాభంతో ట్రేడవుతుండగా. నిఫ్టీ కూడా 17,400 ఎగువన ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్లో మెటల్, ఐటీ, రియల్టీ, ఆటో షేర్లు లాభాలను చవిచూస్తున్నాయి. చమురు, గ్యాస్, బ్యాంకింగ్, ఫార్మా, ఫైనాన్షియల్ స్టాక్లలో కూడా కొనుగోలు ఉత్సాహం కనిపిస్తుంది. దసరా పండగ బుధవారం నాడు భారత స్టాక్ మార్కెట్లు మూతపడ్డాయి. మంగళవారం (అక్టోబర్ 4) నాడు మార్కెట్లో బంపర్ ర్యాలీ నమోదైంది. సెన్సెక్స్ 1276 పాయింట్ల లాభంతో 58,065 వద్ద.. నిఫ్టీ 386 పాయింట్లు లాభపడి 17,274 వద్ద ముగిసింది. సెన్సెక్స్లోని 30 స్టాక్స్లో 28 షేర్లు లాభపడ్డాయి.
మిడ్క్యాప్లో దాదాపు 1 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ కూడా 1 శాతం కంటే ఎక్కువ పెరిగింది. మిడ్క్యాప్ 25,400 కంటే 300 పాయింట్ల కంటే ఎక్కువగా ట్రేడవుతున్నది. స్మాల్క్యాప్ ఇండెక్స్ దాదాపు 400 పాయింట్లు పెరిగి 29,100 కు చేరుకున్నది. ఎన్ఎస్ఈ రియల్టీ, మెటల్స్ 2 శాతానికి పైగా పెరిగాయి. ఆటో, ఐటీ, పీఎస్యూ బ్యాంక్ సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. మరోవైపు, ఎన్ఎస్ఈ
ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించింది.
నిఫ్టీ టాప్ గెయినర్లు, లూజర్స్
జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, హిందాల్కో షేర్లు 3 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. హెచ్సీఎల్ టెక్లో టాటా స్టీల్ 2 శాతం పైగా లాభపడింది. నష్టపోయిన వాటిలో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి స్టాక్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 1 శాతం తగ్గుదల ఉన్నది.