హైదరాబాద్, శంషాబాద్ రూరల్, మే 18: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ).. మరోసారి గ్రీన్ ఎయిర్పోర్ట్ గుర్తింపును పొందింది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) గ్రీన్ ఎయిర్పోర్ట్స్ రికగ్నిషన్ 2022 కార్యక్రమంలో సిల్వర్ అవార్డును అందుకున్నట్టు జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) ప్రతినిధులు తెలిపారు. ఆసియా-పసిఫిక్ రీజియన్లో కర్బన ఉద్గారాల నిర్వహణ కింద 15-50 మిలియన్ల వార్షిక ప్రయాణీకుల విభాగంలో ఆర్జీఐఏ ఈ అవార్డును గెల్చుకున్నది. 2018 నుంచి ఆర్జీఐఏకు ఈ అవార్డులు దక్కుతుండగా, వరుసగా ఇది ఐదోసారి కావడం విశేషం.
పర్యావరణాన్ని దెబ్బతీసేలా విమానయాన పరిశ్రమ ప్రభావం ఉండకుండా, అత్యుత్తమ పర్యావరణహిత కార్యక్రమాలను ప్రోత్సహించేలా గ్రీన్ ఎయిర్పోర్ట్స్ రికగ్నిషన్ కార్యక్రమాన్ని ఏసీఐ నిర్వహిస్తున్నది. ఏటా ఈ అవార్డులనిస్తున్నది. గ్రీన్ బిల్డింగ్స్, పునరుత్పాదక శక్తి వినియోగం, ఇంధన సంరక్షణ, విద్యుత్తు పరిరక్షణ, కార్బన్ సింకింగ్, గ్రీన్హౌజ్ గ్యాస్ ఎమ్మీషన్స్ మేనేజ్మెంట్ తదితర ఎకో ఫ్రెండ్లీ కార్యక్రమాలను చేపడుతున్నట్టు జీహెచ్ఐఏఎల్ ఈ సందర్భంగా తెలిపింది.